భారత్ న్యూస్ రాజమండ్రి…చెన్నైలో మహిళల భద్రత, రక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ‘సింగపెన్నె స్పెషల్ ఫోర్సెస్’ కార్యక్రమాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి C. Joseph Vijay ప్రారంభించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టడం, బాధితులకు వేగవంతమైన సహాయం అందించడం, భద్రతా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం ఈ ప్రత్యేక దళం ప్రధాన లక్ష్యంగా పనిచేయనుంది.
ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ మహిళల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు నిర్భయంగా జీవించే వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సాంకేతికత, ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందితో ఈ ఫోర్స్ పనిచేస్తుందని వెల్లడించారు.

మహిళల సాధికారత, రక్షణ కోసం తీసుకొస్తున్న ఈ కొత్త కార్యక్రమం తమిళనాడులో మహిళా భద్రతకు మరింత బలం చేకూర్చుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.