ఉపాధి హామీ కొత్త డిజిటల్ హాజరు

భారత్ న్యూస్ విజయవాడ…ఉపాధి హామీ కొత్త డిజిటల్ హాజరు

☛ ఉపాధి హామీ కూలీల హాజరులో అక్రమాలను అరికట్టేందుకు ఈ కొత్త విధానం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

☛ హాజరు నమోదు కోసం ప్రధానంగా ఎన్‌ఎంఎంఎస్‌ (NMMS) మరియు ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ (Face RD App) లను ఉపయోగిస్తారు.

☛ కూలీలు రోజుకు రెండు సార్లు (ఉదయం 8 గంటలకల్లా, మధ్యాహ్నం 4 గంటలకు) హాజరు నమోదు చేయాలి.

☛ ఫేస్ ఆర్‌డీ యాప్ ద్వారా గ్రూప్‌లో ఒకరిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి, వారి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గ్రూప్ హాజరును గుర్తిస్తారు.

☛ ఈ కొత్త విధానం అమలు కోసం జిల్లాలో కూలీల ఈకేవైసీ (e-KYC) ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.

☛ నిజంగా పనికి వచ్చే కూలీలు నష్టపోకుండా ఉండేందుకే ఈ యాప్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.