భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఖరీఫ్లో 51 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం.
48 గంటల్లోగా డబ్బు జమ.
రాష్ట్రంలో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొను గోలు కేంద్రాలు, మొత్తం 10,700 మంది సిబ్బందితో ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
