భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో ఆన్లైన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు
అమరావతి :
ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ సిద్ధమైందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, దానికి సంబంధించిన ప్రింట్ అవుట్లను తీసి, సంతకాలు చేసి, నిర్దేశించిన గడువులోగా ఎన్నికల అధికారులకు సమర్పించాలని ఆమె చెప్పారు. అయితే ఈ ఆన్లైన్ విధానం అధికార పార్టీకి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుందని చర్చ జరుగుతోంది.
