అల్లు అరవింద్ కు మాతృ వియోగం

..భారత్ న్యూస్ హైదరాబాద్….అల్లు అరవింద్ కు మాతృ వియోగం

అల్లు అరవింద్ (Allu Aravind) ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇప్పటికే చిరంజీవి కుటుంబం అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్లు షూటింగ్ నిమిత్తం మైసూర్, ముంబయిలో ఉన్నారు. మధ్యాహ్నం వారు హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం. కనకరత్నమ్మ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమె పార్ధివదేహానికి నివాళులు అర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు.