People’s government was formed.. The shackles of Telangana were broken.

భారత్ న్యూస్ హైదరాబాద్,

మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు..

ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.. తెలంగాణ సంకెళ్లు తెగిపోయాయి.

తెలంగాణ ప్రజలకు మరోసారి స్వాతంత్య్రం వచ్చినట్టు అయింది.

ప్రజలు కోరుకున్న తెలంగాణ మళ్ళీ వచ్చింది..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యంత్రి భట్టి విక్రమార్క, మంత్రులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు..

తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద చేసి, తొలి ఉద్యోగం ఇచ్చి, ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్చి, ప్రజా దర్బార్ కు శ్రీకారం చుట్టడం తో రాష్ట్రంలో తోలి రోజే ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుంది..

ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర నేతలు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం హర్షణీయం..