మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని మాజీమంత్రి

భారత్ న్యూస్ హైదరాబాద్…మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ముస్లీం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ ప్రార్ధనలలో నగరంలో ని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ముస్లీం సోదరులు పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం మత పెద్దలు, పలువురు ముస్లీం సోదరులను MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. MLA వెంట సనత్ నగర్ BRS అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు ఖలీల్, రాజేష్ ముదిరాజ్, ఫాజిల్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.