.శ్రీ కోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో కిన్నెర ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కారాల

భారత్ న్యూస్ హైదరాబాద్..శ్రీ కోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో కిన్నెర ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలను ఆయన బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రోది నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండలన్నారు. అన్ని వర్గాల ప్రజలు వృద్ధిని సాధించాలని ఆయన కోరారు. కృషి పట్టుదలతో పని చేసుకుంటూ పోతే ఏ రంగంలో అయిన విజయం సాధించవచ్చునని ఆయన తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.