భారత్ న్యూస్ హైదరాబాద్,హైదరాబాద్, డిసెంబర్ 12 :: రాష్ట్ర ఆర్దిక, ప్రణాళిక, ఇంధన శాఖా మంత్రి మల్లు బట్టి విక్రమార్కను నేడు సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు కలసి అభినందనలు తెలియ చేశారు. ఇంధన శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ తోపాటు ఆశాఖ ఉన్నతాధికారులు మంత్రిని కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఆర్థిక శాఖ రూపొందించిన తెలంగాణా స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ అనే పుస్తకాన్ని మంత్రి బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.