6 నెలలు ఉచితంగా ఆధార్ ఈమెయిల్ అప్‌డేట్

భారత్ న్యూస్ హైదరాబాద్ …6 నెలలు ఉచితంగా ఆధార్ ఈమెయిల్ అప్‌డేట్

ఆధార్ ఈమెయిల్‌ను 6 నెలలపాటు ఆధార్ మొబైల్ Appలో ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చని UIDAI తెలిపింది.

ప్రస్తుతం యాప్‌లో దీని కోసం వినియోగదారులు రూ.75 చెల్లిస్తున్నారు.

అయితే వచ్చే నెల 1 నుంచి DEC 31 వరకు ఈ ఛార్జీ వసూలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

అయితే ఇది యాప్ ద్వారా అప్‌డేట్‌ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.

ఆధార్‌తో Mail లింకై ఉంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పొందవచ్చని చెప్పింది.