…భారత్ న్యూస్ హైదరాబాద్….సూదుల అవసరం లేకుండా రక్త పరీక్షలు!
దేశంలో తొలిసారిగా సూదుల అవసరం లేకుండా రక్తపరీక్షలు చేసే AI ఆధారిత పరికరాన్ని హైదరాబాద్లో నిలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
క్విక్ వైటల్స్ అభివృద్ధి చేసిన ఫొటో ప్లెథిస్మోగ్రఫీ (పీపీజీ) ఆధారిత ఈ పరికరం ముఖాన్ని స్కాన్ చేసి ఒక నిమిషంలో BP, ఆక్సిజన్, హార్ట్బీట్, శ్వాసక్రియ, ఒత్తిడి, హిమోగ్లోబిన్ తదితర వివరాలు తెలియజేస్తుంది.
మొదట 1000 మంది పిల్లలపై టెస్ట్ చేయనున్నారు.
