కర్ణాటక నుంచి అక్రమంగా తరలించి కలగళ్ల గ్రామంలో అధిక ధరలకు విక్రయిస్తున్న ధనుంజయ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు

భారత్ న్యూస్:
కర్ణాటక మద్యం పట్టివేత…

కూడేరు, మార్చి 26 (భారత్ న్యూస్)

కర్ణాటక నుంచి అక్రమంగా తరలించి కలగళ్ల గ్రామంలో అధిక ధరలకు విక్రయిస్తున్న ధనుంజయ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు సిఐ శివరాముడు తెలిపారు. రాబడిన సమాచారం సమాచారంతో దాడులు నిర్వహించగా అతని వద్ద నుండి 30 బేవర్స్ విస్కీ 90 ఎం.ఎల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు.

పేకాటరాయలు అరెస్ట్..
మండల కేంద్రం సమీపంలోని ముద్దలాపురం లింగాలకుంట ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు సిఐ శివరాముడుకు సమాచారం రాగా వెంటనే తమ సిబ్బందితో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేసి 13 మందిని అరెస్టు సిఐ విలేకరులకు తెలియజేశారు, వారి వద్ద నుండి 5160 రూపాయలు సీజ్ చేసి కోర్టుకు హాజరుపరచుతున్నట్లు ఆయన విలేకరులకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బందిపాల్గొన్నారు..