టాటా ఏసీ వాహనము ముందు టైరు ప్రేలిన రోడ్డు ప్రమాదం..

టాటా ఏసీ వాహనము ముందు టైరు ప్రేలిన రోడ్డు ప్రమాదం.. –
-ఇరువురు మహిళా కూలీలు మృతి
-8 మంది కర్నూలుకు తరలింపు
(భారత్ న్యూస్ ::మద్దికేర)
కర్నూలు జిల్లా మండల కేంద్రమైన మద్దికేర గ్రామ సమీపంలోని గుంతకల్ రహదారి మొదటి పెట్రోల్ బంక్ వద్ద టాటా ఏసీ వాహనము ముందు టైరు ప్రేల డంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్దికేరకి చెందిన ఇద్దరు మహిళలు అక్కడి కక్కడే మృతి చెందారు.. డ్రైవర్ తోపాటు మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకై కర్నూలుకు తరలించారు. సంఘటన సమాచారం అందుకున్న పత్తికొండ ఎమ్మెల్యే కంగ్రాటి
శ్రీదేవి గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మద్దికేర గ్రామానికి చెందిన క్షతగాత్రులనైన కూలీలను పరామర్శించారు.