ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రికి రాత్రే వాతావరణం మారిపోయి

భారత్ న్యూస్ అనంతపురం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రికి రాత్రే వాతావరణం మారిపోయి ఈ ఉదయం సుమారు 80 శాతం మేర మేఘావృతమై ఉండటంతో ఈరోజు ఎండ తీవ్రత తగ్గడమే కాకుండా, హైదరాబాద్ – కర్నూలు మార్గమంతటా ఉదయం 11 గంటల వరకు చిరుజల్లులు కొనసాగుతాయి.

ఈరోజు ఉష్ణప్రసరణ (convection) ఆశించనందున రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తక్కువే అయినప్పటికీ, సాయంత్రం లేదా రాత్రి సమయంలో విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు మరియు పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది….