భారత్ న్యూస్ విజయవాడ…ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి !!
లెబనాన్ : మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన అత్యంత కీలక నేత మహమ్మద్ రాడ్ మరణించినట్లు సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ‘అల్ అరేబియా’ పేర్కొంది. హెజ్బొల్లా రాజకీయ, సైనిక విభాగాల్లో కీలక పాత్ర పోషించే రాడ్ మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుండే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. దక్షిణ, తూర్పు లెబనాన్లోని వ్యూహాత్మక ప్రాంతాలపై క్షిపణుల వర్షం కురిపించాయి. హెజ్బల్లా ఆయుధ సంపత్తిని, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ ‘ ఆపరేషన్ రోరింగ్ లయన్ ’ను వేగవంతం చేసింది
