దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు

**

ఈ రోజు అర్ధరాత్రి నుంచే జీఎస్టీ 2.0 అమలు

దీని ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు గణనీయ ఉపయోగం

జీఎస్టీ సంస్కరణల కారణంగా నవరాత్రుల వేళ రేపటి నుంచి దేశంలో సంతోషాలు

అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తాయి..

2017లో జీఎస్టీతో కొత్త అధ్యాయం మొదలైంది..

జీఎస్టీ సంస్కరణల కారణంగా ఎఫ్ఐడీలు బాగా వృద్ధి చెందాయి.

గతంలో ట్యాక్స్ టోల్ తో కంపెనీలకు ఇబ్బందులు

2024లో మేం గెలిచిన తరువాత జీఎస్టీపై మరింత దృష్టి

వన్ నేషన్ – వన్ ట్యాక్స్ మాకు అత్యధిక ప్రాధాన్యం

జీఎస్టీ సంస్కరణలతో అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపాం.

అన్ని రంగాల్లో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయి.

టీవీ, ఫ్రిజ్, స్కూటర్, కార్ల ధరలు మరింత తగ్గుతుంటాయి.

ఆత్మ నిర్భర్ దిశగా అడుగులు వేస్తున్నాం.

నాగరికత దేవోభవ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం.

99 శాతం వస్తువులు 5 శాతం శ్లాబుల్లోకి మార్చాం.

చిన్న పరిశ్రమలే భారత్‌ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దిక్సూచిగా మారాయి.

అంతా స్వదేశీ వస్తువులనే ప్రోత్సాహించాలి.

మన దేశంలో తయారయ్యే వస్తువులనే కొనాలి.

స్వదేశీ వస్తువులను కొన్నామని గర్వంగా చెప్పండి

మరికొన్నింటిపై 5 శాతం పన్ను మాత్రమే వేశాం.

రూ.12 లక్షల వరకుక ఆదాయపన్నును తొలగించాం.

ఈ చర్యలతో మధ్య తరగతి జీవితాల్లో ఎంతో మార్పు రానుంది.

కొత్త జీఎస్టీతో పేద మధ్యతరగతివారికి డబుల్‌ బొనాంజా.