నన్ను దీవించి..ఇందిరమ్మ కుటుంబానికి బహుమతి ఇవ్వండి..

భారత్ న్యూస్ హైదరాబాద్….

నన్ను దీవించి..
ఇందిరమ్మ కుటుంబానికి బహుమతి ఇవ్వండి..

జన జాతర బహిరంగ సభలో
ఎంపీ అభ్యర్థి నీలం మధు

పార్లమెంట్ ఎన్నికలలో తనను గెలిపించి, స్వర్గీయ ఇందిరమ్మ కుటుంబానికి బహుమతి ఇవ్వాలని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్ చెరువు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జన జాతర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ.. మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించిన స్వర్గీయ ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి పరిశ్రమలు, కంపెనీలను తీసుకువచ్చి, కల్పించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందని బిజెపి బీఆర్ఎస్ లు ప్రశ్నిస్తున్నాయని, గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయా పార్టీలు ఏం చేశాయో? చూపాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలోనే పేదలకు ఇండ్లు, భూములు కేటాయించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఐదు గ్యారెంటీల అమలుతో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. తనను గెలిపిస్తే ఎంపీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి ఈ మెదక్ గడ్డ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.పార్లమెంట్ ఎన్నికలలో ఎవరి