చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం,,

భారత్ న్యూస్ గుడివాడ.

తిరుచానూరు నుంచి టీడీపీలో చేరికలు

చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం తిరుచానూరుకు చెందిన వైసీపీ నేతలు ఎం.ఉమాపతి, మణిలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పులివర్తి నాని వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. కొత్త వారిని ప్రోత్సహిస్తూ పాత వారిని గౌరవిస్తూ ముందుకు పోతామని పులివర్తి నాని పిలుపునిచ్చారు. 25 ఏళ్ల కల సాకారం చేసేందుకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.