All the Christians should celebrate the Christmas festival in Telangana state

భారత్ న్యూస్ హైదరాబాద్,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అందరూ ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఆదివారం హుస్నాబాద్ నియోజక వర్గం లోని, రాష్టం లోని క్రైస్తవ సోదరులకు మంత్రి పొన్నం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు కృపతో క్రిస్మస్ పండుగ నుంచి 2024లో ప్రజలందరూ ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. మంచి మనసుతో పాలకులు, అధికారులు ప్రజలకు సేవలు అందించాలి అని, మంచి సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు.