రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు: ఎంపీ రవిచంద్ర

భారత్ న్యూస్ హైదరాబాద్,,

ఎంపీ వద్దిరాజు రంజాన్ శుభాకాంక్షలు

Date 10/04/2024

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు: ఎంపీ రవిచంద్ర
రంజాన్ పర్వదినం (రమదాన్,ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణలోని ముస్లిం సమాజానికి, తెలంగాణకు చెందిన దేశవిదేశాలలో నివసిస్తున్న,స్థిరపడిన ముస్లిం సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల మాసం క్రమశిక్షణ, ఆథ్యాత్మిక చింతన, దాతృత్వం,ప్రేమ,క్షమ,దయ,ఉపకారం, సోదరభావం,ఐక్యతను పెంపొందిస్తుందని తన సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.పవిత్ర ఖురాన్ అవతరించిన మాసంలో ముస్లింలు ఉపవాసాలు ఉంటూ ఆథ్యాత్మిక చింతనతో ప్రత్యేక ప్రార్థనలు, దానధర్మాలు చేస్తుంటారన్నారు.తెలంగాణ సమాజం మత సామరస్యానికి పెట్టినది పేరని ఆయన వివరించారు.ముస్లింలు తమ ఉపవాస దీక్షలు విరమించి భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని ఎంపీ వద్దిరాజు ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.