భారత్ న్యూస్ హైదరాబాద్,
ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడేది కమ్యూనిస్ట్ లు:
కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే కూనంనేనికి ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి విప్లవ శుభాకాంక్షలు:
ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి
ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడేది కమ్యూనిస్ట్ లు మాత్రమేనని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా విజయం పట్ల ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లో మాక్ధూమ్ భవన్ లోని రాజ్ బహదూర్ హాల్ లో కూనంనేని కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర,ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ కూనంనేని గెలుపు పార్టీకి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ప్రజా సమస్యల పట్ల అపార అనుభవం, గతంలో ఎమ్మెల్యేగా చిరస్మరణీయ సేవలు అందించారని, మళ్ళీ గెలుపుతో అసెంబ్లీలో సిపిఐ వాణిని వినిపిస్తారన్నారు. కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్థి, నిరుద్యోగ యువత, మహిళ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తి పరిష్కారం చూపిస్తారన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని నిరుద్యోగులు యువత విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని వారి సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ యుగంధర్, మహేందర్, కార్యవర్గ సభ్యులు ఆర్. బాలకృష్ణ, షేక్ మహమూద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.