క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ప్రతి మానవుడిలో ప్రేమ ,క్షమగుణం పెంపొందాలి అనే క్రీస్తు ఆలోచన విధానం నిత్యం ఆచరణనియం అని ఆయన చెప్పారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఆయన తెలిపారు. విశ్వ మానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు నింపిన కరుణమయుడని అన్నారు. శాంతియుత సమాజ స్థాపన కోసం తన రక్తం చిందించిన ధీశాలి యేసుక్రీస్తు ప్రభువు అన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.