భారత్ న్యూస్ హైదరాబాద్,ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్ తి ఆర్ భవన్ లో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలంపల్లీ అశోక్ అధ్యక్షతన డా బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. డా బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పార్టీ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోస్న, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు కాట్రగడ్డ ప్రసూన, సామా భూపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్షులు అజ్మీరా రాజు నాయక్, జీవిజి నాయుడు, షేక్ అరిఫ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డా ఏ ఎస్ రావు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు, సంధ్య పోగు రాజశేఖర్, మద్దూరి సాంబశివరావు, లీలా పద్మావతి, రాష్ట్ర కార్యదర్శి కట్ట రాములు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి తమొదన్ ,ప్రధాన కార్యదర్శి రాఘవులు, తెలుగు యువత రాష్ట్ర నాయకులు కిరణ్, జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షులు నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.