5th January every year as National Bird Day

…Bharathnews.hyd,,,,

ప్రతి సంవత్సరం జనవరి 5తేదీని జాతీయ పక్షుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము అని అటవీ& పర్యావరణ మంత్రి కొండ సురేఖ అన్నారు.. పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధనా సంస్థ (EPTRI) EIACP పక్షుల జాతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ముఖ్యమైన వాస్తవాలను ప్రస్తావిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో పక్షులు పోషించే కీలక పాత్ర మరియు అవి ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన పెంచడం కోరకు ఈరోజు నీ జరుపుతున్నాం అని మంత్రి అన్నారు.. ఈ విధమైన
ఒక విజ్ఞాన వాల్ పోస్టర్ ను సిద్ధం చెయ్యడం జరిగింది. దానిని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా వుంది అని అటవీ& పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు…
(మంత్రి గారి కార్యాలయం)