భారత్ న్యూస్ కోడూరు
వైయస్సా పార్టీకి జై కొట్టిన నక్కవానిదారి గ్రామ యువత
- కుటుంబీకులతో కలిసి పార్టీలో చేరిన 14 మంది తెలుగుదేశం, జనసేన పార్టీ యువకులు
- కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
కూటమి పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయమని రమేష్ బాబు ఈ సందర్భంగా అన్నారు.
ఐదేళ్ల పాలనలో తాను నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ప్రజల మధ్య ఉంటూ భరోసా కల్పించిన విషయాన్ని రమేష్ బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కోడూరు- అవనిగడ్డ ప్రధాన రహదారి నిర్మాణం, చుక్కల భూముల సమస్యను పరిష్కరించిన తర్వాతే మళ్లీ ఓటుకు వస్తానని చెప్పానని, ప్రస్తుతం ఆ హామీలు నెరవేర్చగలిగానని ధైర్యంగా చెప్తున్నానని రమేష్ బాబు అన్నారు.
ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్రావుతో తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని రమేష్ బాబు కోరారు. పార్టీ మండల, గ్రామ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.