రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిన మాజీ మంత్రి రెడ్డి వారి..

భారత్ న్యూస్ గుడివాడ……

రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిన మాజీ మంత్రి రెడ్డి వారి చెంగారెడ్డి అన్న కుమారులు రెడ్డి వారి రాజవేల్ రెడ్డి


రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా గారి సమక్షంలో నిండ్ర మండలం కొప్పేడు గ్రామానికి చెందిన మాజీ మంత్రి రెడ్డి వారి చెంగారెడ్డి అన్న కుమారులు రెడ్డి వారి రాజవేల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సిపిలో సోమవారం చేరారు.

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా గారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పరిపాలన మరియు నగరి నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధిపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి మంత్రి రోజా గారి నాయకత్వంలో పనిచేయుటకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.