వికలాంగురాలిపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేయాలి…

భారత్ న్యూస్:
వికలాంగురాలిపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేయాలి…

వి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న డిమాండ్..

కూడేరు మే 6 (భారత్ న్యూస్)
పుట్టపర్తి సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలానికి చెందిన మానసిక వికలాంగురాలు ఒంటరిగ ఉన్న విషయం గమనించి కొంతమంది వికలాంగురాలిపై విచక్షణ రహితంగ అత్యాచారం చేసి అక్కడి నుండి ఆ దుండగులు పారిపోవడం జరిగిందని, అటువంటి మానవృగాలను తక్షణమే పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేసి వికలాంగుల యాక్ట్ తో పాటు ఫోక్స్ చట్టం పరిధిలో కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న డిమాండ్ చేశారు, అలాగే బాధితురాలికి ఆమె తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా, వారిని కఠినంగా శిక్షించాలని లేదంటే సంబంధిత పోలీస్ స్టేషన్ ముందు బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఆయన విలేకరులకు తెలియజేశారు..