వైసిపి ప్రభుత్వంలోనే ఎస్సీలకు అభివృద్ధి, అధిక ప్రాధాన్యత అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే,,

భారత్ న్యూస్ ఘంటసాల

వైసిపి ప్రభుత్వంలోనే ఎస్సీలకు అభివృద్ధి, అధిక ప్రాధాన్యత అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, మేనల్లుడు డాక్టర్ గంగాధర్ రాయుడు గారు..

ఈరోజు ఘంటసాల మండలం, చినకళ్లేపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న, అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, మేనల్లుడు డాక్టర్ గంగాధర్ రాయుడు గారు, ప్రతి గడపకు వెళ్లి ఓటును అభ్యర్థించారు, నా ఎస్సీ, నా ఎస్టి, నా బీసీ, నా మైనార్టీలు అనే పిలిచే ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నామినేటెడ్ పదవుల్లో సంక్షేమ పథకాలలో అధిక ప్రాధాన్య ఇస్తూ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని, మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు పై వేసి మచిలీపట్నం పార్లమెంట్ వైసిపి అభ్యర్థి డాక్టర్ శ్రీ సింహాద్రి చంద్రశేఖర రావు గారిని, అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారిని, అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు…

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు..