కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి,,

భారత్ న్యూస్ అవనిగడ్డ

కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందే శ్రీరామమూర్తి అన్నారు.

అవనిగడ్డ ప్రధాన సెంటర్లో సోమవారం శ్రీరామమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాన సెంటర్లోని దుకాణాల యజమానులకు, వాహన దారులకు కరపత్రాలు పంచుతూ, ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా శ్రీరామమూర్తి మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా మాత్రమే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు అలాగే మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోల్లు కృష్ణ లకు ప్రతి ఒక్కరూ తమకు గల రెండు ఓట్లను హస్తం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసినదిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోరాటాల పురిటి గడ్డకు పెట్టిందిగా పేరుగాంచిన సిపిఐ, సిపిఎం, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ లు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం తనకు గర్వకారణంగా ఉన్నదన్నారు.

ఈ కార్యక్రమంలో కోడూరు మండల పార్టీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు దిడ్ల వీర రాఘవులు, చల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు అందే లెనిన్ తదితరులు పాల్గొన్నారు.