అభివృద్ధి, సంక్షేమం, దోపిడీ లేని పాలన కూటమి ప్రభుత్వంనే సాధ్యం,,

భారత్ న్యూస్ చల్లపల్లి

అభివృద్ధి, సంక్షేమం, దోపిడీ లేని పాలన కూటమి ప్రభుత్వంనే సాధ్యం

ఉమ్మడి మ్యానిఫెస్టోలో మహిళా సంక్షేమానికి పెద్దపీట

అభివృద్ధి జంట బాలసౌరి, బుద్ధప్రసాద్ లకు మద్ధతుగా నిలవండి

ఆముదార్లంకలో మండలి వెంకట్రామ్..సాయిసుప్రియ ప్రచారం

చల్లపల్లి : అభివృద్ధి, సంక్షేమం, దోపిడీ లేని పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అవనిగడ్డ నియోజకవర్గ కూటమి అభ్యర్థి డా.మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ అన్నారు. సతీమణి సాయి సుప్రియ, టీడీపీ..జనసేన నేతలతో కలిసి చల్లపల్లి మండలం ఆముదార్లంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రచారానికి విశేష స్పందన లభించింది.
ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం, దోపిడీలను ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. చట్టవిరుద్ధంగా సహజ వనరులను దోపిడీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఉమ్మడి మ్యానిఫెస్టోలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారని, బీసీ..ఎస్సీల సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వల్ల జరిగే నష్టాన్ని వివరించారు.
వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దనీ.. అభివృద్ధి.. సంక్షేమం కోసం టీడీపీ.. జనసేన.. బీజేపీ కూటమికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి జంట వల్లభనేని బాలసౌరి, మండలి బుద్ధప్రసాద్ ల విజయం కోసం గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
టీడీపీ, జనసేన నాయకులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.