::ఎన్.డీ.ఎ.కూటమి గెలుపుకోసం ప్రచారంలో కామినేని బంధు మహిళలతో కలసి మాజీ గ్రంథాలయం చైర్మన్ ఈడుపుగంటి,,

ఏలూరు జిల్లా ముదినేపల్లి :::29-4-2024… (భారత్ న్యూస్)::::ఎన్.డీ.ఎ.కూటమి గెలుపుకోసం ప్రచారంలో కామినేని బంధు మహిళలతో కలసి మాజీ గ్రంథాలయం చైర్మన్ ఈడుపుగంటి వెంకట్రామయ్య కోడలు హేమ,తో కలసి పాల్గొన్న తెలుగుమహిళలు
ఈరోజు ఉదయం ముదినేపల్లి మండలం ముదినేపల్లి గ్రామంలో ఎన్డీ.ఏ. కూటమి అభ్యర్థి అయిన మాజీ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ ని, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ పుట్ట మహేష్ యాదవ్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కామినేని శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు ఈడుపుగంటి శ్రీనివాస్ సతీమణి ఈడుపుగంటి హేమ , మోడీ పథకాల గురించి మరియు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు తెలియపరుస్తూ, ఎం.ఎల్.ఎ గా కామినేనిని ఎంపీ గా పుట్ట మహేష్ యాదవ్ ని గెలిపించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులైన ఎర్నేని కిషోర్ బాబు , కోడూరు శేషు బాబు , బొంగు రవికుమార్ , జగదీష్ , లోకేష్ , పరస కనకారావు , వీరిశెట్టి కొండలరావు , నాగరాజు, మరియు ఇతర గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు