ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం,,,ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందాం..

: భారత్ న్యూస్ కోడూరు

ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం

ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందాం

భాజపా సీనియర్ నాయకురాలు భోగాది రమాదేవి

ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు భోగాది రమాదేవి అన్నారు.

బుధవారం నాడు కోడూరు మండల భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఆమె గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.

రెండు ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేసి మండలి బుద్ధప్రసాద్ ను, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాల శౌరి ని గెలిపించాలని ఆమె కోరారు.

ప్రచారంలో ఎక్కడికెళ్లినా కూడా ప్రజలు నుండి విశేష స్పందన లభిస్తుందని, కేంద్రంలో మరొకసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో టిడిపి, జనసేన, భాజపా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల భాజపాధ్యక్షులు వడుగు నాగబాబు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కో కన్వీనర్ తుంగల వెంకటగిరి, ఓబీసీ మోర్చా కృష్ణాజిల్లా కార్యదర్శి కొండవీటి రామకృష్ణ, దేవరకొండ సుబ్బారావు, విశ్వనాథపల్లి వేణు పులిగడ్డ భాస్కర రావు తోపాటు భారతీయ జనతా పార్టీ నేతలు పాల్గొన్నారు.