.పోటు మీద గ్రామంలో జనసేన, టిడిపి, భాజపా నేతల విస్తృత ప్రచారం,,,

భారత్ న్యూస్ కోడూరు

.పోటు మీద గ్రామంలో జనసేన, టిడిపి, భాజపా నేతల విస్తృత ప్రచారం

-ఉమ్మడి అభ్యర్థులు గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం

-రెండు ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేసి గెలిపించండి

కోడూరు మండల పరిధిలోని పోటు మీద గ్రామపంచాయతీ పరిధిలో పలు వార్డుల్లో జనసేన, టిడిపి, భాజపానేతలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

  • అవనిగడ్డ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాల శౌరి గెలిపించవలసినదిగా పోటు మీద గ్రామ జనసేన, టిడిపి, భాజపా నేతలు ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

-ప్రజలకు కరపత్రాలు అందజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలో కి రాగానే చేపట్టే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ రెండు ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరారు.

-ఈ కార్యక్రమంలో బావిశెట్టి వెంకట కోటేశ్వరరావు, మేక చిన్న వీరబాబు, కడవకొల్లు రమేష్, జరుగు వెంకటేష్, కడవకొల్లు రామాంజనేయులు, కడవకొల్లు దశరధ రామయ్య భావిశెట్టి శ్రీనివాసరావు, బావిశెట్టి నాగేశ్వరరావు చిమ్మట చంద్ర, అప్పికట్ల సత్యనారాయణ, మలిశెట్టి స్వాములు, బావిశెట్టి శ్రీనివాసరావు తోపాటు పెద్ద సంఖ్యలో జనసేన, టిడిపి నేతలు పాల్గొన్నారు.