నా రాజకీయ అరంగ్రేటం పాకాల మండలం నుంచే ప్రారంభం….. వైయస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ,,

నా రాజకీయ అరంగ్రేటం పాకాల మండలం నుంచే ప్రారంభం….. వైయస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

పాకాల( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రగుంట నుండి పాకాల-చిత్తూరు రోడ్డు కూడలి వరకు భారీ ఎత్తున యువతతో బైక్ ర్యాలీ వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల సమక్షంలో శుక్రవారం నిర్వహించి,బాణాసంచ పేల్చి,గజమాలతో సత్కరించి దుశ్యాలవతో సన్మానించారు.
ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరిందని అన్నారు.మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరువలేనిది,నాకు ఇష్టమైన మండలం,నా రాజకీయ అరంగ్రేటం పాకాల మండలం నుంచే ప్రారంభించామని పేర్కొన్నారు.పాకాల మండలంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి పనులు చేసామని,మా కుటుంబం కరోనా సమయంలో అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుని,నియోజకవర్గంలో వివాహాలు జరుపుకునే అన్ని కుల మతాల పేద కుటుంబాల వారికి పెళ్ళికానుక అందజేసి ఆదుకున్నామని తెలిపారు.మే 13వ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు,మహిళా నాయకురాలు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.