ఉల్లిపాలెంలో హోరెత్తిన కూటమి శ్రేణుల ప్రచారం.

భారత్ న్యూస్ కోడూరు

ఉల్లిపాలెం అభివృద్ధి ప్రదాత మండలి..!
ఉల్లిపాలెంలో హోరెత్తిన కూటమి శ్రేణుల ప్రచారం.

కోడూరు:ఉల్లిపాలెం గ్రామ అభివృద్ధి ప్రదాత మండలి బుద్ధప్రసాద్ అని గ్రామంలో రోడ్లన్నీ సిసి రోడ్లు వేయించి ,గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దిన ఘనత మండలి బుద్ధ ప్రసాద్ దేనని మండలి సాయి సుప్రియ అన్నారు.

శుక్రవారం అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విజయాన్ని ఆకాంక్షిస్తూ మండలి బుద్ధ ప్రసాద్ కోడలు సాయి సుప్రియ ఉల్లిపాలెం గ్రామంలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గాజు గ్లాస్ గుర్తుపై రెండు ఓట్లు వేసి మండలిని ,వల్లభనేని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థింగా గ్రామస్తులు విశేష ఆదరణ అందించడంలో గ్రామంలో కూటమి శ్రేణుల ప్రచారం హోరెత్తింది.

ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.