నేడు కురుబ శంకర్ నారాయణ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి రండి.

భారత్ న్యూస్:
నేడు కురుబ శంకర్ నారాయణ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి రండి.

కూడేరు ఏప్రిల్ 23 (భారత్ న్యూస్ ) : అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైయస్సార్సీపి పార్టీ నుండి బుధవారం నామినేషన్ కార్యక్రమానికి కూడేరు మండల వ్యాప్తంగా భారీగా వైసీపీ శ్రేణులు తరలి రావాలని, కూడేరు మండల వైఎస్సార్సీపీ నాయకులు, మండల ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పిటిసి భర్త అశ్విని హరీష్, జే సి ఎస్ మండల కన్వీనర్ జల్లేపల్లి దేవేంద్ర, మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, సింగల్ విండో ప్రెసిడెంట్ వడ్డే గంగాధర్, మండల జనరల్ సెక్రెటరీ తోపుదుర్తి రామాంజనేయులు, విలేకరుల సమావేశంలో మండల ప్రజలకు తెలియజేశారు, కూడేరు మండలము నుండి ప్రతి గ్రామం నుండి అనంతపురం నకు ఉదయం 10 గంటలకు భారీగా చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా యువత తరలి రావాలని, ర్యాలీ గా కూడేరు మండలం నుండి వెళ్లడం జరుగుతుందన్నారు.
వైఎస్సార్ సీపీ పాలనలో ప్రతి ఒక్క కుటుంబమునకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిందని, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉరవకొండ నియోజకవర్గం నుండి వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థిగా వై విశ్వేశ్వర్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి, అలాగే అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి కురుబ శంకర్ నారాయణ ను ఫ్యాను గుర్తుపై ఓటు వేయవలెనని నేడు బుధవారం,నామినేషన్ కార్యక్రమానికి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున మహిళలు విశ్వ అన్న అభిమానులు, యువ నేత ప్రణయ్ రెడ్డి అభిమానులు శ్రేయోభిలాషులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, వేలాదిగా తరలివచ్చి నామినేషన్ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు.. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి జిల్లా ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షులు జల్లిపల్లి మంజునాథ్ రెడ్డి, కరుట్లపల్లి శంకరయ్య, అక్కలప్ప, జయపురం దళిత నాయకుడు సంజీవ రాయుడు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు..