-వడ్డెరపాలెంలో మండలి సాయి సుప్రియ కు ఘనస్వాగతం పలికిన కాలనీవాసులు,,,

భారత్ న్యూస్ కోడూరు

-వడ్డెరపాలెంలో మండలి సాయి సుప్రియ కు ఘనస్వాగతం పలికిన కాలనీవాసులు

-సాయి సుప్రియను
ఆత్మీయంగా సత్కరించిన – మహిళలు

-టీఎస్ఆర్ గ్రూపు ఆధ్వర్యంలో సాయి సుప్రియ కు ఆత్మీయ సత్కారం

రెండు ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేసి గెలిపించండి

-వడ్డెర కాలనీలో కూటమి నాయకులు, కార్యకర్తల తో కలిసి ఓట్ల అభ్యర్థించిన సాయి సుప్రియ.

కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డెరపాలెంలో అవనిగడ్డ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ కోడలు మండలి సాయి సుప్రియ ఓట్ల అభ్యర్థించారు.

-ముందుగా వడ్డెర కాలనీ లో ప్రచారానికి ముందు టి ఎస్ ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో మండలి సాయి సుప్రియ కు మహిళలు టీఎస్ఆర్ గ్రూపు సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు.

మహిళలు హారతి ఇచ్చిన అనంతరం ప్రచారాన్ని స్థానిక మహిళలు, నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి నిర్వహించారు.

-ప్రతి ఇంటి వద్దకు వెళుతూ అవనిగడ్డ నియోజకవర్గం, మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే మండలి బుద్ధ ప్రసాద్కు వల్లభనేని బాలశౌరి కి రెండు ఓట్లు కూడా గాజు గ్లాస్ పై వేసి గెలిపించవలసినదిగా కోరారు.

  • ప్రచారం అనంతరం సాయి సుప్రియ ను టిఎస్ఆర్ గ్రూపు ఆధ్వర్యంలో ఆత్మీయంగా సత్కరించారు.
  • ఈ కార్యక్రమంలో కోడూరు మండల తెలుగుదేశం, జనసేన భాజపా నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొనగా టి ఎస్ ఆర్ గ్రూప్ సభ్యులు వేముల వెంకటేశ్వరరావు, తిరుపతి వీరాంజనేయులు, బత్తుల శ్రీహరి, తిరుపతి వెంకట నాంచారయ్య, ఉప్పు చిన్న వెంకటేశ్వరరావు, బండారు రవీంద్ర, వేముల నాగ రాజు, తిరుపతి నవీన్, తిరుపతి ప్రసాద్ తో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.