మెరకనపల్లిలో ముమ్మరంగా ప్రచారంఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బుద్ధప్రసాద్ అల్లుడు అశ్విన్,,,

భారత్ న్యూస్ మోపిదేవి

మెరకనపల్లిలో ముమ్మరంగా ప్రచారం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బుద్ధప్రసాద్ అల్లుడు అశ్విన్

మోపిదేవి : మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామంలో కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ ముమ్మరంగా ప్రచారం జరిగింది. టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి డా.మండలి బుద్ధప్రసాద్ అల్లుడు శీలం అశ్వినీకుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్ధించారు. రెండు ఓట్లను గాజు గ్లాసు గుర్తుపై వేసి వల్లభనేని బాలసౌరి, మండలి బుద్ధప్రసాద్ లకు అఖండ విజయాన్ని అందించాలని కోరారు. బ్యాలెట్ బాక్సులో ఆరవ నెంబరులో రెండు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసారు.