భారత్ న్యూస్ విజయవాడ…ఏపీని తాకిన రుతుపవనాలు
ఏపీ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాలను తాకాయి.
ఏపీలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నెల 10వ తేదీకల్లా ఏపీలోని సగానికిపైగా భూభాగంలోకి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది.
