కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి దంపతులు తంజమ్మకొట్టాలు వద్ద ఆగారు

భారత్ న్యూస్ విశాఖపట్నం..కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి దంపతులు తంజమ్మకొట్టాలు వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటిముంజలు తీస్తుండగా కాన్వాయ్‌ను నిలిపి వారి వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులు…

Ammiraju Udaya Shankar.sharma News Editor…ముంజలు తీసి ఇవ్వండి… రుచి చూస్తాం అని అడిగారు. కార్మికులు అందించిన తాజా తాటిముంజలను సీఎం దంపతులు రుచి చూశారు.

ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో ముఖ్యమంత్రి కాసేపు ఆత్మీయంగా సంభాషించారు. వారి పనితీరు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు…