భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్..!
ఆంధ్రప్రదేశ్లో ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం 24 గంటల్లోనే పూర్తికానుంది.
ఎటువంటి జాప్యం లేకుండా, వాహనదారులకు వెంటనే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని రవాణా శాఖను ఆదేశించిన సీఎం చంద్రబాబు.
రవాణా శాఖ అధికారులు కచ్చితంగా 24 గంటల లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ అధికారులు నిర్ణీత 24 గంటల్లోగా ప్రక్రియను పూర్తి చేయకపోతే, అది ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఆమోదం పొందుతుంది.

ఈ నూతన విధానం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుంది.