భారత్ న్యూస్ అనంతపురం..యాపిల్ కొత్త CEOగా జాన్ టెర్నస్
టెక్ దిగ్గజం యాపిల్ నూతన సీఈఓగా జాన్ టెర్నస్ సెప్టెంబర్ 1 నుండి బాధ్యతలు చేపట్టనున్నారు.
సుదీర్ఘ కాలం సంస్థను నడిపించిన టిమ్ కుక్, ఇకపై ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా సేవలందిస్తారు.
యాపిల్ 20 ఏళ్ల అనుభవం ఉన్న టెర్నస్, ప్రస్తుతం హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఐఫోన్, ఐప్యాడ్ వంటి గ్లోబల్ ప్రొడక్ట్స్ తయారీలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.
కుక్ వారసుడిగా టెర్నస్ నియామకం యాపిల్ భవిష్యత్తుపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.