భారత్ న్యూస్ వరంగల్….. …..ఈసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి….
రేషన్ లబ్ధిదారులకు ఈసారి 3 నెలల బియ్యం ఒకేసారి అందనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి చౌక ధరల దుకాణాల్లో పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ను ఒకేసారి ఏప్రిల్లో ఇవ్వనున్నట్లు పౌరసరఫరాలశాఖ వర్గాలు తెలిపాయి.
