దేశవ్యాప్తంగా తారస్థాయికి చేరిన గ్యాస్‌ సంక్షోభం

భారత్ న్యూస్ విజయవాడ…దేశవ్యాప్తంగా తారస్థాయికి చేరిన గ్యాస్‌ సంక్షోభం

గ్యాస్‌ కొరతతో అల్లాడిపోతుంటే. సంక్షోభం లేదన్న కేంద్రం

ఏజెన్సీల ముందు బారులు తీరిన సామాన్య ప్రజలు.పంజాబ్‌లో క్యూలోనే వృద్ధుడు మృత్యువాత.గుజరాత్‌లో లైన్‌లోనే సొమ్మసిల్లి పడిపోయిన మహిళ
భారీగా మూతబడ్డ హోటల్స్‌, మెస్సులు, పీజీలు, హాస్టల్స్‌ బ్లాక్‌ మార్కెట్‌లో 3 రెట్ల అధిక ధరకు గ్యాస్‌ విక్రయాలు

దేశంలో గ్యాస్‌ సంక్షోభం పట్టించుకోకుండా ఇక్కడి ఎల్పీజీని విదేశాలకు ఎక్కువ డబ్బులకు విక్రయిస్తుడటంపై మహారాష్ట్రలోని విదర్భకు చెందిన ఆరుగురు గ్యాస్‌ డీలర్లు బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంటూ గ్యాస్‌ నిల్వలు, సరఫరా సమాచారం ఇవ్వాలని కేంద్రం, సీపీఐఎల్‌కు నోటీసులు జారీ చేసింది