.భారత్ న్యూస్ హైదరాబాద్….మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారిపై కఠిన చర్యలు
తెలంగాణ హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు మార్చి 1 నుంచి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఒరిజినల్ లేదా డిజిటల్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. లైసెన్స్ లేకుండా పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉంది. లైసెన్స్ లేని వారికి వాహనం ఇస్తే, ప్రమాదం జరిగినప్పుడు యజమానిని బాధ్యుడిని చేస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రాదు.
