ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్‌రావు DSP హోదా ర‌ద్దు!

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్‌రావు DSP హోదా ర‌ద్దు!

తెలంగాణ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆయనను డీఎస్పీ నుంచి డిమోట్ చేస్తూ అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసింది. డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి డిమోట్ చేశారు. 2007 బ్యాచ్ కు సంబంధించిన ప్రణీత్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు. కాగా డీఎస్పీని సీఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.