తెలంగాణలో పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం లభ్యం

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం లభ్యం

తెలంగాణలో క్రీ.పూ. ఒకటి- క్రీ.శ. మూడో శతాబ్దం మధ్య కాలం నాటి బుద్ధ విగ్రహం లభ్యమైంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో కోలేటి నాగేశ్వరరావు పొలంలో పురాతన పాలరాతి బుద్ధ విగ్రహం లభ్యమైంది. ఉపాధి కూలీలు మట్టిని తవ్వుతున్న క్రమంలో విగ్రహం బయటపడిందని, దీంతోపాటు మరో రెండు శిలలు లభ్యమయ్యాయని రైతు తెలిపారు. ఇక ఈ విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు….