భారత్ న్యూస్ రాజమండ్రి…జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారితో జిల్లాలో “ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ” లు
శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.
అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని పలు సమస్యలాత్మక గ్రామాలు, కాలనీలలో తనిఖీలు
రౌడీషీటర్లు, పాత కేసుల్లో నిందితులు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితుల ఇళ్లల్లో విస్తృత చెకింగులు
కళ్యాణదుర్గం, తాడిపత్రి, రాయదుర్గం పోలీసుస్టేషన్ల పరిధిలో రికార్డులు సరిగా లేని 72 బైకులు, 3 ఆటోలు, 2 కార్లు, 64 మద్యం సీసాలు స్వాధీనంతో పాటు ఇద్దరు మట్కా బీటర్లు ——————-*———
జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి మేరకు జిల్లా వ్యాప్తంగా ఈరోజు వేకువజామునే కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి.
డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్తులు, ట్రబుల్ మాంగర్లు, రౌడీషీటర్లతోపాటు ఇతర రాష్ట్రాల మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లు, పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరిగాయి.
అనుమానితుల వివరాలను లోతుగా తనిఖీ చేశారు. ఆయా గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్ జరిగింది.
అనంతరం… గ్రామసభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని నిర్ణయించారు. మట్కా, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలియజేసారు.

సమస్యలు సృష్టించినా, ప్రేరేపించినా కారణమైన వారిపై నియంత్రణ చర్యలు తప్పవని సూచించారు.