ఏపీలో చికెన్ వ్యాపారులకు అలర్ట్.. కొత్త విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో చికెన్ వ్యాపారులకు అలర్ట్.. కొత్త విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో చికెన్ దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి

ప్రజలకు నాణ్యమైన చికెన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం

పౌల్ట్రీ నుంచి దుకాణం వరకు కోళ్ల సరఫరాపై పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ వ్యాపారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా చికెన్ దుకాణాలకు లైసెన్సింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనతో అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది.

ఈ నూతన విధానం ద్వారా కోళ్ల సరఫరా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. ఏ పౌల్ట్రీ ఫారం నుంచి ఎన్ని కోళ్లు ఏ దుకాణానికి వెళ్తున్నాయి, రోజువారీ అమ్మకాల వివరాలు.. వంటి సమాచారాన్ని పక్కాగా నమోదు చేయనున్నారు. దీనివల్ల కోళ్ల ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి చేరే వరకు ప్రతి దశను ట్రాక్ చేయడం సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

అంతేకాకుండా, ఆరోగ్యానికి హాని కలిగించే స్టెరాయిడ్లు వాడి పెంచిన కోళ్ల విక్రయాలను పూర్తిగా నియంత్రించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. గుర్తింపు పొందిన, లైసెన్స్