పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడి.. ఆరుగురు సస్పెండ్

భారత్ న్యూస్ తిరుపతి…పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడి.. ఆరుగురు సస్పెండ్

📍తిరుపతి జిల్లా నారాయణవనం(M)లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

పాలిటెక్నిక్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిపై ఈ నెల 20న సీనియర్ విద్యార్థులు దాడి చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 25న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆరుగురు స్టూడెంట్స్ను కాలేజీ యాజమాన్యం తాజాగా సస్పెండ్ చేసింది.

అమ్మాయి విషయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.